సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్లో తీవ్ర దుమారమే రేపింది. స్టార్ వారసులకు తప్ప బయటి వారికి బాలీవుడ్లో చోటు లేదని అంతా భావిస్తున్నారు. దీంతో కరణ్జోహార్, అలియా భట్, సల్మాన్ ఖాన్ లాంటి వారిపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతో సోషల్ మీడియా ద్వారా వీళ్లను ఫాలో అవుతున్న వారు ప్రస్తుతం వీరిని అనుసరించడం మానేస్తున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కు నెటిజన్లు షాకిచ్చారు. ఈమె స్వల్ప కాలంలోనే 4.45 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందట. ఇక, స్టార్ వారసులకే అవకాశాలు కల్పిస్తుంటాడనే విమర్శను ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న దర్శకనిర్మాత కరణ్జోహార్ను 1.88 లక్షల మంది అన్ ఫాలో చేశారట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా 50 వేల మంది ఫాలోవర్లను కోల్పోవడం గమనార్హం.
ఫ్లాప్ అయితే ముఖం చాటేస్తారు .. హిట్టొస్తే వెంటపడతారు : కైరా అద్వాని