శర్వానంద్ హీరోగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అదితిరావ్ హైదరీని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని పరిశీలించిన తర్వాత అదితిని ఖరారు చేసినట్లు యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు ఆమె సరైన ఛాయిస్ అని భావించి హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ముందు హీరోయిన్గా సమంతను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే సిద్ధార్థను హీరోగా తీసుకోవడం వల్లే సమంత ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
previous post
“బిగ్ బాస్”పై గీతా మాధురి కామెంట్స్