telugu navyamedia
సినిమా వార్తలు

సెట్స్ పైకి “బాఘీ-3”

Bhaghi-3

బాలీవుడ్లో “బాఘీ-3” చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులోను టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించనుండగా, శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయికగా న‌టిస్తుంది. అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో పార్ట్ తెర‌కెక్క‌నుండ‌గా, సాజిద్ న‌డియావాలా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మూడో పార్ట్‌ని 2020 మార్చి 6న విడుదల కానుంది. అయితే బాఘీ సిరీస్‌లో వ‌చ్చిన రెండో పార్ట్ తెలుగు సినిమా “క్ష‌ణం”కి రీమేక్‌గా తెరకెక్క‌గా, మూడో పార్ట్ ఏ చిత్రాన్ని రీమేక్‌గా తీస్తారో చూడాలి. “బాఘీ-3” నేటి నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఏడు రోజుల పాటు తొలి షెడ్యూల్ జ‌ర‌ప‌నుండ‌గా, సెర్బియా, జార్జియాలో త‌ర్వాతి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నార‌ట‌. అక్టోబ‌ర్‌లో క్లైమాక్స్‌కి సంబంధించిన షూటింగ్‌ని ఆ ప్రాంతాల‌లో జ‌ర‌ప‌నున్నారు. వ‌ర్షం సినిమాకి రీమేక్ గా హిందీలో తెరకెక్కిన “బాఘి” చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీకి సీక్వెల్‌గా “బాఘీ-2” చిత్రాన్ని తీసారు. అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం గ‌త ఏడాది మార్చి 30న విడుద‌లై మిక్స్‌డ్‌ టాక్ ద‌క్కించుకుంది. చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశాపటానీ ప్రధాన పాత్రలలో పోషించ‌గా నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ “బాఘీ-2” రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండానే “బాఘీ-3” కూడా ప్లాన్ చేశారు.

Related posts