ఏపీలో ఇటీవలే మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మద్యం షాపుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో తగ్గించిన 20 శాతంతో కలిపి మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించినట్టయింది. తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,934కి తగ్గింది. ఏపీ సర్కారు ఇప్పటికే 40 శాతం బార్లను తొలగించింది. తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న 13 శాతం దుకాణాలను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం: అంబటి