బెంగాల్లో కరోనా సోకిన రోగులకు నిరంతరం సేవలు అందిస్తున్న డాక్టర్లు వైద్యసిబ్బందికి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. రాత్రింభవళ్ళు కష్టపడుతున్న వైద్యసిబ్బంది వారం విడిచి వారం పనిచేయాలని ఆదేశించారు. ఒకవారం పనిచేసిన అననతరం ఆ తర్వాత వారం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
విశ్రాంతి లేకుండా వైద్యులు పనిచేస్తున్నందున వైరస్ సోకకుండా సరైన రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దాంతో రాష్ట్రంలో ఇటీవలే రెండు దవాఖనల్లో ఇతర రోగులకు కరోనా సోకటంతో వాటిని మూసేశారు. దీంతో మమత ప్రభుత్వం వైద్య సిబ్బందికి విశ్రాంతి కల్పించింది.