telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సామాజిక

చదువుకున్నవాడికంటే .. చాకలోడే మేలు అన్నట్టే.. భార్యపై ..

SIT Investigation YS viveka Murder

మహారాష్ట్రలో నిధిపై దురాశతో భార్యను ‘ఉపవాసాలు’ చేయించిన భర్త ఉదంతం వెలుగుచూసింది. స్వయం ప్రకటిత దేవునిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి సలహా మేరకు నిధి కోసం ఓ భర్త తన భార్యను 50 రోజుల పాటు పస్తులు వుంచినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది ఆగస్ట్‌లో ఆ మహిళకు వివాహమైందని, అప్పటి నుండి పూజలు చేయాలని ఆమెపై ఒత్తిడి ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. దేవుడిగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి ఆ మహిళ ఉపవాసంతో పాటు పూజలు చేస్తే నిధి దొరుకుతుందని భర్తకు, అత్తమామలకు వివరించాడు. దీంతో వారు ఆమెను ఈ దీక్ష చేయాలని వేధించడం ప్రారంభించారని షాగోన్‌ పోలీసులు తెలిపారు.

ఆ మహిళను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు ప్రతి రోజూ ఉదయం 2.45 నుండి పూజలు చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని అన్నారు. 50 రోజుల నుండి సరైన ఆహారం అందించలేదని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండేందుకు ఆమె మొబైల్‌ను కూడా లాక్కున్నారని అన్నారు. దీంతో అనుమానం వచ్చిన తండ్రి ఆమెను చూసేందుకు వారి గ్రామానికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ‘అంధ విశ్వాసాల నిర్మూలన కమిటి’ ఆ మహిళ భర్త, అత్తమామలను శిక్షించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై సెక్షన్‌ 498 (ఎ) కింద, పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని గురువారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

Related posts