telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెహర్ రమేష్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ?

chiru

కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. ‘ఆచార్య’ ఇంకా సెట్స్ పైన ఉండగానే మరికొన్ని ప్రాజక్టులను కూడా లైన్లో పెట్టారు. వీటిలో రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి. మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ సినిమా, మరొకటి తమిళంలో వచ్చిన ‘వేదాళం’. ‘లూసిఫర్’కు మొదట్లో సుజిత్ ను దర్శకుడిగా అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మార్పులు జరగడంతో ఆ ప్రాజక్టులోకి కొత్తగా వీవీ వినాయక్ వచ్చాడు. ప్రస్తుతం వినాయక్ ‘లూసిఫర్’ స్క్రిప్టుపై పనిచేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ‘వేదాళం’ రీమేక్ కి తన కజిన్ మెహర్ రమేశ్ కి దర్శకుడిగా చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఇటీవలే ఈ స్క్రిప్టును చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా రూపొందించి చిరంజీవికి మెహర్ వినిపించాడట. దీనికి చిరంజీవి ఎటువంటి మార్పులు చెప్పకుండా, సంతృప్తిని వ్యక్తం చేసి, వెంటనే ఓకే చెప్పేశారని అంటున్నారు. ఈ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో సినిమా చేయాల్సిందిగా చిరంజీవిని ఆయనే ఒప్పించారని టాక్. మరో ప్రాజక్టుకు సంబంధించి దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడు.

Related posts