దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సైతం మే 3 వరకూ పొడిగిస్తూ కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు, అధికారులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనాపై అవగాహన కల్పిస్తూ పాటలు, షూట్లు చేస్తున్నారు. తాజాగా కరోనాపై కోలీవుడ్లో ఓ సినిమా తెరక్కెనుంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ కూడా పేట్టేశారు. ‘21డేస్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎంబీఆర్ ఫిలిమ్స్ బ్యానరుపై ఎం విజయ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. ఆయనే దర్శకత్వం కూడా వహించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. లాక్డౌన్ తర్వాత సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అఖిల్ పై హైపర్ ఆది పంచులు