కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టం తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సకాలంలో స్పందించడం వల్లే అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని అన్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఆరు రోజుల పాటు సమాజంలో తిరిగితే 3200 మందికి పైగా అంటిస్తాడని చైనాలో గవర్నర్ అధ్యయన పూర్వకంగా చెప్పారని తెలిపారు.
ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.
ఓ తుపాను కానీ, ఓ భూకంపం కానీ సంభవిస్తే అది ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందని, కానీ కరోనా అలా కాదని, ప్రపంచాన్ని కబళించివేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యక్తులు కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం అని, ఇక్కడ రాజకీయాలకు తావులేదని అన్నారు. ఇక ప్రజలకు కూడా చంద్రబాబు సూచనలు చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే శ్రేయస్కరం అని స్పష్టం చేశారు.
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా