మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ నిన్న దిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం మన్మోహన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి.
ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మంచి ఆరోగ్యం కలగాలి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’ అంటూ లో తెలిపారు.
I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji.
— Narendra Modi (@narendramodi) October 14, 2021
మరోవైపు ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా ఇవాళ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ మొత్తం బీజేపీతో కలిసిపోతుంది..జేసీ సంచలన వ్యాఖ్యలు