ప్రస్తుతం కరోనా భయంతో స్కూల్స్, థియేటర్స్, షూటింగ్స్, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్లు ఆగిపోయాయి. మరోవైపు సినీ సెలెబ్రిటీలు తమ అభిమానులకు కరోనా నుంచి ఎలా దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లకే పరిమితమై కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే ఓ స్టార్ డైరక్టర్ మాత్రం తన మూవీ షూటింగ్ను కానిచ్చేస్తున్నారు. 2017లో ఫిదాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల ఆ తరువాత దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నారు. ఆ తరువాత నాగ చైతన్యతో లవ్ స్టోరీ మూవీని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ మూవీ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో కరోనాను పట్టించుకోకుండా ఆయన తన సినిమా షూటింగ్ను కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్నగర్లో జరుగుతుండగా.. అందులో ప్రధాన పాత్రాధారులైన నాగ చైతన్య, సాయి పల్లవిలపై ఆయన చిత్రీకరణను కొనసాగిస్తున్నారు.
previous post
next post