తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తారు. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్లో ఓ నెటిజన్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశంపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Request @Collector_MDL and @HMDA_Gov to look into below https://t.co/pYLTtCYZ7p
— KTR (@KTRTRS) 9 January 2019
మేడ్చల్ జిల్లాలోని కీసర్ చెరువును ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడంటూ వెంకట్ బోగి అనే వ్యక్తి కేటీఆర్కు ఈ రోజు ట్విట్టర్ ద్వారా తెలిపారు. చెరువులో మట్టి తోలిన ఫొటోను కూడా జత చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ వ్యవహారమేంటో చూడాలంటూ వెంకట్ ట్వీట్ను జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులకు ట్యాగ్ చేశారు.