telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తొలి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్!

AP Congress Manifesto released
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. అధికార టీడీపీ ఇప్పటికే జిల్లాల వారీగా కొంతమంది పేర్లను ప్రకటించింది. తాజాగా  కాంగ్రెస్  పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించింది. అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున ప్రముఖ న్యాయవాది హరేసముద్రం అశ్వద్ధ నారాయణ పోటీ చేస్తారని  ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు.  నారాయణ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి  ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు ప్రచారంతో ఆ పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా అన్ని అసెంబ్లీ స్థానాలకు  అభ్యర్థులను ప్రకటిస్తామని రఘువీరా వెల్లడించారు.

Related posts