ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యంగా అటవీశాఖ అధికారులు పని చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పర్యావరణహిత రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని, సీఎం స్వప్నాన్నినిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరిచుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభతో మంత్రి మాట్లాడారు. అడవుల సంక్షణ, పునరుద్దరణపై ప్రజల్లోనూ విసృత అవగాహన కల్పించే దిశగా అటవీశాఖ ఉద్యోగులు పనిచేయాలని సూచించారు.
దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోంది: వీహెచ్