ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట్లా యుద్దం జరుగుతోంది. ఇప్పటికే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారం పార్లమెంట్కు చేరింది. ఈ వాయిదా విషయాన్ని వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించారు.
ఎన్నికల వాయిదా ఏకపక్ష నిర్ణయమని ఆయన ఆరోపించారు. కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయమని అన్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్గా తీసుకోవాలని ఎంపీ లావు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.5100 కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా లోక్సభలో లావు ప్రస్తావించారు.