telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

త్రివిధ దళాలకు ఉమ్మడి అధికారిగా .. బిపిన్ రావత్.. !

army chief ravath checking in LOC

దేశంలో మూడు దళాల అనుసంధానిస్తూ ఒక బాస్ ను నియమించాలని నిర్ణయించినట్టు మోదీ ఇప్పటికే పేర్కొన్నారు. రక్షణ దళాల అధిపతి ‘సిడిఎస్’ పేరుతో ఓ అధిపతిని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం అవుతున్నది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ నేతృత్వంలో ఓ కమిటీ దీనిపై ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసింది. త్రివిధ దళాల అధిపతిగా ఎవరిని నియమించాలి అనే అంశంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31 తో ముగియనున్నది. ఆయన్ను సిడిఎస్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బిపిన్ ఈ విషయంలో చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. అయన నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. అలాంటి వ్యక్తులే త్రివిధ దళాలకు అధిపతిగా ఉండాలి అని ప్రభుత్వంభావిస్తోంది.

జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుండటం విశేషం. మూడు దళాలకు ఒక్కరే బాస్ గా ఉంటె.. నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. అప్పుడు త్రివిధ దళాలు మరింత సమర్ధవంతంగా ధైర్యంగా అడుగు వేస్తాయి. ఇండియా తీసుకోబోతున్న సిడిఎస్ విధానంపై దాయాది దేశం భయపడుతున్నది. ఒక్కరే బాస్ ఉంటె, అందులోను బిపిన్ బాస్ గా వస్తున్నాడు అని తెలిసిన పాక్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో తమ సైన్యం సిద్ధంగా ఉందని, చిన్న అవకాశం ఇస్తే, పీవోకే ను కలిపేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారుబిపిన్. ఇది పాక్ ను కలవరపరిచే విషయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Related posts