telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం ప్రారంభం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పడవ తరగతి విద్యార్థులకు విద్యాకానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు జతల యూనిఫాం, రెండు జతల షూ, పుస్తకాలు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదన చేయనున్నారు. సీపీఎస్ ర్యాలీలపై నమోదైన కేసుల రద్దుపై కేబినెట్‌లో నేతలు ప్రస్తావించనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ జరుగనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

Related posts