telugu navyamedia
Uncategorized

ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్ సుభాష్ చోప్రా రాజీనామా

subhash-chopra-News delhi

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అంతేకాదు, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి పోలైన ఓట్లశాతం కూడా గణనీయంగా పడిపోయింది.

2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం ఓట్లు పోలవగా, ఈసారి అది 4.27 శాతానికి దిగజారింది. దీంతో ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ సుభాష్ చోప్రా తన పదవికి రాజీనామా చేశారు.గెలుపు తమదేనని చివరి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ గతంతో పోలిస్తే కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

Related posts