మాస్ మహరాజ్ రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది `రాక్షసుడు`తో హిట్ సాధించిన రమేశ్ వర్మ తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి `కిలాడీ` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `క్రాక్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది.