ప్రస్తుతం డిటిటల్ వరల్డ్ హవా నడుస్తుండటంతో ఓటీటీ ఫ్లాట్ఫామ్లో సినిమాలకు సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ మూవీలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. దీంతో తాజాగా ‘బ్లూ ఐస్’ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న “బ్లూ ఐస్” ట్రైలర్ బ్లూ ఫిల్మ్ మాదిరే ఉంది. కంటెంట్తో సంబంధం లేకుండా రొమాంటిక్ సీన్లతో నింపేశారు. బికినీలతో పాటు బెడ్ రూం సీన్లలో రెచ్చిపోయి నటించారు. ఈ సినిమాలో ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ వంటి నూతన నటీనటులు నటించారు. మాదాల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకత్వం వహించారు. త్వరలో ఈ మూవీ శ్రీయాస్ ఈటీ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫామ్లో విడుదల కానుంది.
నెహ్రూపై మోదీ చేసిన ఆరోపణలు కరెక్టు కాదు: జగ్గారెడ్డి