ప్రాంతాలకు అతీతంగా అందరూ అమరావతి కోసం కదం తొక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అమరావతి పరిరక్షణ కోసం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ సీఎంకు పరిపాలన చేతకాదని విమర్శించారు.
ప్రజా వేదికతో మొదలు పెట్టి ప్రతిదీ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అమరావతిలోనూ విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు. అభివృద్ధి పనులు ఎప్పుడో ఆగిపోయాయని, పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉంగుటూరు మండలంలో జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ యాత్రలో మాజీ మంత్రి పితాని, మాజీ శాసససభ్యుడు చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్