తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగూర్ నీటి తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
నీటి సమస్యపై మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.