ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘భారత్ బచావో’ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. దేశంలోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారన్నారు.
దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశ రక్షణ కోసం అందరం కలిసి పోరాటం చేయాలని సోనియా వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు రాక, రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. పౌరసత్వ బిల్లు వల్ల భారతీయ ఆత్మ ముక్కలు ముక్కలు అవుతుందన్న విషయాన్ని మోదీ-షా ఏ మాత్రం పట్టించుకోవట్లేదని సోనియా విమర్శించారు.
ఆయనేమీ తక్కువోడు కాదు.. దగ్గుబాటిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు