ప్రస్తుతం దేశంలో ఉల్లిపాయకి రెక్కలు రావడంతో సోషల్ మీడియాలో ఉల్లి ధరలపై సెటైర్స్ పెరిగిపోయాయి. ఫలితంగా పలు మీమ్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఉల్లిపాయకి సంబంధించి పలు జోకులు పేలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉల్లి ఇయర్ రింగ్స్ని తన శ్రీమతికి బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరచాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ న్యూస్. కరీనా కపూర్, కియారా అద్వాణీ, దిల్జిత్ దొసాంజ్ ముఖ్య పాత్రలు పోషించారు. మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు అక్షయ్ గ్యాంగ్. ఈ క్రమంలో కపిల్ శర్మ షోకి వెళ్లారు. ఆ షోలో ఆనియన్ ఇయర్ రింగ్స్ కరీనాకి చూపించారు. అవి తనకి అంతగా నచ్చలేదు. దీంతో తన శ్రీమతికి బహుమతిగా ఇచ్చారు. “కపిల్శర్మ షో నుండి వచ్చిన అక్షయ్ ఉల్లి ఇయర్ రింగ్స్ని నాకు బహుమతిగా ఇచ్చారు. కరీనాకి నచ్చకపోవడంతో నీ కోసమే వాటిని తీసుకొచ్చాను అని అక్షయ్ నాతో అన్నారు. కొన్ని సార్లు ఇలాంటి చిన్న సరదా విషయాలే మన హృదయంలో నిలిచిపోతాయి. ఆనియన్ రింగ్స్ బెస్ట్ గిఫ్ట్” అని ట్వింకిల్ ఖన్నా తన పోస్ట్లో పేర్కొన్నారు.
previous post