telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎవరు ఏ పార్టీకి ఓటేసినా..ఇప్పుడు అందరూ మనవాళ్లే: సీఎం కేసీఆర్‌

is kcr effects national politics

ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లేనని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్‌లో అడవులను పునరుద్ధరిస్తున్నామన్నారు. మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పతీ చెరువు, కుంట నిండి పంటలు పండినప్పుడే నిజమైన సంతోషం వస్తుందన్నారు.

నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో అడవి విస్తరించిందని తెలిపారు. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉందని చెప్పారు. . ఆదర్శం ఉంటే అధికారులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలి, ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలో కళకళలాడాలని పేర్కొన్నారు.

Related posts