మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అధికారిక పత్రిక అయిన ‘సామ్నా’ పత్రిక ఎడిటర్ పదవికి ఉద్ధవ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆ పదవిని ఎంపీ సంజయ్ రౌత్ చేపట్టబోతున్నారు.
తొలిసారి థాకరేల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఈ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గతంలో శివసేనకు చెందిన ఇద్దరు నేతలు మనోహర్ జోషి, నారాయణ రాణేలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: చంద్రబాబు