telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను బాగా రాణిస్తానని హామీ ఇవ్వలేను : ధోని

నిన్న వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ మరి నెమ్మదిగా ఆడాడు. 6 బంతులు ఆడిన తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. చివరకు 17 బంతుల్లో 18 రన్స్ చేశాడు. ధోనీ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు బాదినప్పటికీ లయను అందుకోవడానికి మాత్రం ఇబ్బంది పడ్డాడు. అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘నేను నెమ్మదిగా ఆడటం చెన్నైకి నష్టం కలిగిస్తుంది. దీనికి అంగీకరిస్తున్నా. అయితే ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తానని హామీ ఇవ్వలేను. ఈ మ్యాచ్‌లో నేను ఆడిన మొదటి ఆరు బంతులు వేరే మ్యాచులో ఉపయోగపడతాయి. మనం మెరుగ్గా ఆడుతున్నప్పుడు ఆన్‌ఫిట్‌ అని ఏ ఒక్కరూ అనరు. ఇది నిజం. ప్రదర్శన అనేది హామీ ఇవ్వలేని అంశం. నా 24 ఏళ్ల వయసులోనూ బాగా రాణిస్తానని అప్పుడు హామీ ఇవ్వలేదు. ఇప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఇప్పుడు కూడా హామీ ఇవ్వలేను’ అని అన్నాడు. ‘ఫిట్‌గా ఉండ‌టానికి మాత్రం ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తా. ఈ విష‌యంలో టీమ్‌లోని యువ ఆట‌గాళ్ల‌తో పోటీ ప‌డ‌తాను. ఫిట్‌నెస్ విష‌యంలో మాత్రం నావైపు ఎవ‌రూ వేలెత్తి చూప‌కుండా చూసుకుంటాను’ అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పాడు.

Related posts