హైదరాబాద్ మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 29న జాబ్మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసి సంస్థ నిర్వహించే ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎం. ఫార్మ సీ, బి.ఫార్మసీ విద్యార్హత కలిగి 18 సంవత్సరాలు పై బడి ఉండే యువతీ, యువకులు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫొటో, సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. వివరాలకు 9542180700 సంప్రదించాలని తెలిపారు.