తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ను దాటుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందుకు సాగుతోంది. సమ్మెకు కార్మికులు బలవుతున్నారు. కరీంనగర్ ఆర్టీసీ డిపో-2లో మెకానిక్ కరీంఖాన్ మృతి చెందాడు. కరీంఖాన్ రెండు రోజుల కిందట గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరీంఖాన్ మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.
మరో వైపు డిమాండ్లు సాధిస్తామని కార్మికులు మెట్టు దిగడం లేదు. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డిపోల ముందు ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్న కార్మికులు, విపక్ష నేతల్ని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు.నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.