గతంలో స్టార్ హీరోయిన్ గా వెండితెరపై హవా చూపించి, ప్రేక్షక లోకాన్ని తన నటనతో మైమరపించిన అద్భుతమైన నటి రమ్యకృష్ణ. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ ఈతరం హీరోయిన్ల కంటే బిజీగా మారిపోయిందనే చెప్పాలి. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర ఆమె కెరీర్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్న రమ్యకృష్ణ ఇప్పుడు “రొమాంటిక్” చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుందట. ఆమె పాత్ర చిత్రానికి కీలకంగా మారనుందని అంటున్నారు. నేటి నుండి హైదరాబాద్లో జరగనున్న షెడ్యూల్లో టీంతో జాయిన్ కానుంది. పూరీ జగన్నాథ్ నిర్మాణంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రానికి అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టపోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం విదితమే.
previous post
సమంత చేసే ఆ పని నాగ చైతన్యకు నచ్చడం లేదట…!?