telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

20 సంవత్సరాల తరువాత రమ్యకృష్ణతో కృష్ణవంశీ

Krishna

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. అయితే ఆయన ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ పడలేదు. ఆయన దర్శకత్వం వహించిన “నక్షత్రం” సినిమా ఫ్లాప్ కావడంతో చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు మళ్ళీ త‌న త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఎలాగైనా మంచి హిట్ కొట్టాల‌నే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట ఈయ‌న‌. తాజా స‌మాచారం ప్ర‌కారం కృష్ణ వంశీ త‌న భార్య రమ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రాన్ని రూపొందించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఇందులో విలక్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా, కృష్ణ వంశీ, రమ్య‌కృష్ణ తొలిసారి 1998లో చంద్ర‌లేఖ సినిమా కోసం ప‌నిచేశారు. మ‌ళ్ళీ 20 ఏళ్ళ త‌ర్వాత వారిద్దరు ఓ ప్రాజెక్ట్ కోసం క‌లిసి పని చేయ‌నుండ‌డం విశేషం.

Related posts