`ఆర్ఎక్స్100` సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి `మహాసముద్రం` పేరుతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను చాలా మంది హీరోలకు వినిపించాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆయన వరుస సినిమాలతో బిజీ కావడంతో ఈ సినిమాకు సమయం కేటాయించలేకపోయాడు. దీంతో చివరికి యంగ్ హీరో శర్వానంద్ ఈ కథను ఓకే చేశాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుందనుకున్న సమయంలో హీరోయిన్ సమంత డ్రాప్ అయింది. దీనికి కారణం ప్రస్తుతం శర్వానంద్తో కలిసి నటించిన ‘జాను’ ఫలితమే అని సమాచారం. సమంత నో చెప్పడంతో ఈ సినిమా కోసం ‘సమ్మోహనం’ ఫేం అదితి రావ్ హైదరీని తీసుకున్నట్లు తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకుడు. చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తున్నారు.
previous post
next post