చెన్నైకు చెందిన 2వేల మంది పాఠశాల విద్యార్థులు చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భారత పర్యటనను పురస్కరించుకుని ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికారు. జిన్పింగ్ మాస్క్లు, ఎరుపు రంగు టీ షర్టులు ధరించి చైనీస్ భాషలో వెల్కమ్ అనే అక్షరాల ఆకారంలో కూర్చున్నారు. దాని వెనకే హార్టీ వెల్కమ్ అనే పసుపు రంగు అక్షరాలను అలంకరించారు. దీనికి వెనకవైపున చైనా అధ్యక్షుడి ఫోటోను ఉంచారు. వాటికి ఇరువైపులా విద్యార్థులు ఎరుపు జెండాలను పట్టుకొని కూర్చున్న ఫోటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
జిన్పింగ్ అక్టోబరు 11, 12న భారత్లో పర్యటించనున్నారు. మోదీతో భేటీ కానున్నారు. గతేడాది ఏప్రిల్లో ఇరువురు నేతలు చైనాలోని వూహాన్లో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఈ సమావేశం భారత్లో జరగనుంది. ఈ భేటీకి చెన్నై సమీపంలోని చరిత్రాత్మక నగరం మహాబలిపురంలో వేదిక కానుంది. ఈ పర్యటనకు సంబంధించి చెన్నై విమానాశ్రయంలో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, భౌగోళిక అంశాలు చర్చకు రానున్నాయి.
బీజేపీ పాలనలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి: సీఎల్పీ భట్టి