కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందేనని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కరోనా వల్ల ఎన్నడూ చూడని ఘటనలు చూస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా విజృంభణ వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలపై తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.