పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తూ, యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రాష్ట్రానికి ఔషధనగరి అవసరమా లేదా అన్న చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల నోట్లో మట్టి కొట్టి పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కారు రైతులను మోసం చేస్తోందన్నారు.
యూపీఏ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాలేదని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఐటీఐఆర్ను పూర్తి చేస్తే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.