telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోపన్‌పల్లి భూకబ్జాలపై రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌

MLA Balka Suman praises Padmarao

గోపన్‌పల్లి భూకబ్జాలపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌ మెయిలింగ్‌కు రేవంత్‌ రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సుమన్‌ ధ్వజమెత్తారు. రేవంత్‌ బతుకంతా బ్లాక్‌మెయిల్‌ బతుకు.. తామేమో ఉద్యమకారులమన్నారు. ఎదుటివారిపైనా బురద జల్లడమే ఆయన పని అని సుమన్‌ దుయ్యబట్టారు.చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్‌ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. రేవంత్‌ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందన్నారు.

ఎన్నికల ఆఫిడవిట్లలో భూముల వివరాలను కేటీఆర్‌ స్పష్టంగా చూపించారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెలిపారు. శంకర్‌పల్లి ఫామ్‌హౌస్‌ను కేటీఆర్‌ లీజుకు తీసుకున్నారని సుమన్‌ స్పష్టం చేశారు. లీజు ప్రకారం డబ్బులు కూడా చెల్లిస్తున్నారని తేల్చిచెప్పారు. కేటీఆర్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి రేవంత్‌ కుట్రలు చేస్తున్నారని సుమన్‌ ఆరోపించారు.

Related posts