*బీహార్లో బలపరీక్షలో నెగ్గిన నితీష్
*మీరు పిల్లలు… ఏమి తెలియదంటూ బీజేపీ ఎమ్మెల్యేలపై నితీష్ కుమార్ సెటైర్లు
*సీఎం వ్యాఖ్యలతోవాకౌట్ చేసిన బీజేపీ సభ్యులు
బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏకగ్రీవంగా నెగ్గింది. విశ్వాసపరీక్షపై చర్చ సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. ఈ సమయంలో బీజేపీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం నితీష్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యనించారు. 2015లో బీజేపీని తానే గెలిపించానని అన్నారు. 2024లో తానేంటో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. వాజ్పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవన్నారు.
2017లో తేజస్వీ యాదవ్పై విమర్శలు చేశారని, ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. ప్రజలను భయబ్రాంతుకు గురిచేయడం లేదా వారిని కొనుగోలు చేయడం బీజేపీ ఫార్ములా అని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. బిహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సభలో స్పష్టం చేశారు.ఆర్జేడీ-జేడీయూ భాగస్వామ్యం సుదీర్ఘ కాలం నిలవనుందని పేర్కొన్నారు.
అయితే కొందరు బీజేపీ నేతలు వాకౌట్ చేయటంపైనా నితీష్ స్పందించారు. “నాకు వ్యతిరేకంగా పని చేస్తే తప్ప బీజేపీ నేతలకు మంచి పదవులు రావు. నన్ను టార్గెట్ చేయాలని బహుశా మీ బాస్ల నుంచి ఆర్డర్స్ వచ్చాయనుకుంటా” అని వ్యాఖ్యానించారు.