హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్గా తెలంగాణ సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్భవన్లో గవర్నర్గా దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణం చేయించారు. ఇటీవల పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా దత్తాత్రేయకు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా అవకాశం ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. .ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, దత్తాత్రేయ కుటుంబసభ్యులు హాజరయ్యారు.
గత పాలనలో అంతా అవినీతే.. అసెంబ్లీలో మంత్రి బొత్స