తెలంగాణ గవర్నర్ నరసింహన్ పదవీకాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్కు తెలంగాణ ప్రభుత్వం ప్రగతిభవన్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాట్లు చేసింది. సందర్భంగా గవర్నర్తో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన నరసింహన్తో అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని కేసీఆర్ తెలిపారు.
రాజ్భవన్లో గవర్నర్ దంపతులు ప్రతీ పండుగను గొప్పగా నిర్వహించేవారు. నరసింహన్ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులను కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నరసింహన్ వివరించేవారన్నారు. యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. సోదరభావంతో గవర్నర్ నరసింహన్కు పాదాభివందనం చేసి యాదాద్రి పునరుద్ధరణ పని ప్రారంభించానని తెలిపారు.


పంచాయితీ ఎన్నికల పై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు…