టీడీపీ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో ఆరోపణలు ఎదోర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నివాసంలో చోరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఫర్నిచర్ వ్యవహారం పై కోడెల శివప్రసాదరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్శారు. తన కార్యాలయంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ను తీసుకెళ్లేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.
ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవాలని జూన్లోనే ప్రభుత్వానికి లేఖ రాశానని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ అంశంలో తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు: నారా లోకేశ్