ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన వేడుకలను నేడు రాజ్భవన్లో జరుపుకోనున్నారు. 86వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆయన జన్మదిన వేడుకలను గిరిజన, దళిత చిన్నారుల మధ్య జరుపుకుంటారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఉదయం ఆయనకు టీటీడీ, కనకదుర్గమ్మ దేవస్థాన పండితులు ఆశీర్వచనం అందించనున్నారు.
అనంతరం గవర్నర్ కేక్ కట్చేసి చిన్నారులకు కొత్త బట్టలు, పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉండడంతో ప్రభుత్వం తరపున మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు గవర్నర్ జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు.
విభజన వల్ల రాజధానిని నష్టపోయాం: మంత్రి ధర్మాన