కర్ణాటక రాజకీయ సంక్షోభం పై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తనకెలాంటి సంబంధం లేదని చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన అపాయింట్మెంట్ కోరలేదని తెలిపారు. ఒక వేళ ఎవరైనా తనను కలవాలనుకుంటే కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పీకర్ రమేశ్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
previous post
next post