తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో శశిధర్ రెడ్డికి సంబంధించిన వార్త కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
ఈ నేపథ్యంలో శశిధర్ రెడ్డి స్పందించారు. సిద్ధాంతాలు, విలువల విషయంలో తాను రాజీపడే వ్యక్తిని కాదన్నారు. తాను గాంధేయవాదినని, గాడ్సే వారసులతో చేతులు కలపడం అసాధ్యమని తెలిచి చెప్పారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.