హైదరాబాద్ పంజాగుట్టలోని ఫ్లయ్ ఓవర్ పై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కారు బైక్ పై వేళ్తున్న వ్యక్తిని నాగార్జున సర్కిల్ సమీపంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న మహమ్మద్ తాజుద్దీన్ అనే యువకుడు ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్రగాయాల పాలై మరణించాడు.
తాజుద్దీన్ ‘తెలంగాణ సమాచారం’ అనే వార్తా పత్రికలో పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఐడీ కార్డు ఉండటంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో కారు కూడా దెబ్బతినడంతో ఫ్లయ్ ఓవర్ పై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్ ను సహాయంతో కారును అక్కడి నుంచి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.