తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం “ఖైదీ” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పోస్టర్తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన యూనిట్ తాజాగా టీజర్ విడుదల చేసింది. మా నగరం ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంతో కార్తీ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.
మరోవైపు రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు కార్తీ. రష్మికా మండన్నా కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాపనాశం తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ. జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించనున్న ఈ సినిమాలో ఆన్సన్ పాల్ కీలక పాత్రలో కనిపించనున్నారట. గోవింద్ వసంత్ చిత్రానికి సంగీతం అందించనుండగా, రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం