telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ పై విషప్రయోగం…!?

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌పై విష ప్రయోగం జరిగిందంటూ తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విటర్ ద్వారా ఆరోపణ చేశారు. “సుశాంత్ మరణం వెనకున్న హంతకుల కౄర స్వభావం మెల్లిమెల్లిగా బయటకు వస్తోంది. సుశాంత్ కడుపులో విషం ఆనవాళ్లు లేకుండా పోవాలనే ఉద్దేశంతోనే శవపరీక్షను ఆలస్యం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలి” అని సుబ్రహ్మణ్యం స్వామి ట్వీట్ చేశారు.

శరీరంలో విషం ఆనవాళ్లు ఆరు గంటల సేపు మాత్రమే ఉంటాయని ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ ఒకరు తాజాగా వెల్లడించారు. మరణించిన 12 గంటల తర్వాత సుశాంత్ శరీరానికి పోస్ట్‌మార్టమ్ జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టమ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సీబీఐ విచారణలో సుశాంత్ కేసు ఎలాంటి మలుపు తీసుకోనుందో చూడాలి.

Related posts