సీడ్ల్యూసీ మొదలుకొని రాష్ట్రస్థాయి, జిల్లా స్ధాయి నేతల నుంచి ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్గాంధే కొనసాగాలని మద్దతు వస్తోంది. రాహుల్గాంధేనే కాంగ్రెస్ను నడిపించాలని నేతలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కోరారు. పార్టీలో సీనియర్లతో పాటు జూనియర్లకు అవకాశాలు ఇవ్వాలన్నారు.
కొందరు కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని రాహుల్ గుర్తించడం సంతోషమని, ఏపీలో ఓ ఆత్మ తనను రాహుల్కు దూరం చేస్తోందని వీహెచ్ ఆరోపించారు. వైసీపీకి వచ్చిన సీట్లను చూసి జగన్ కూడా ఆశ్చర్యంలో ఉన్నారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాజీపూర్ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు పరామర్శించాలని వీహెచ్ అన్నారు.a
సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ