మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో తాను ఎలాంటి బాధ్యతలు స్వీకరించలేనని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య రీత్యా విశ్రాంతి అవసరమని జైట్లీ లేఖలో పేర్కొన్నారు. గత 18 నెలలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, బాధ్యతల నుంచి విశ్రమించి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు లేఖలో జైట్లీ పేర్కొన్నారు.
మోదీ సారథ్యంలోని బీజేపీ, ఎన్డీయే అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా మోదీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవమని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అరుణ్ జైట్లీ తన లేఖలో వెల్లడించారు.
నా భార్య నైతిక విలువలున్న మనిషి: సిద్ధూ