‘మహానటి’తో జాతీయ ఉత్తమనటి అవార్డుని దక్కించుకున్న కీర్తిసురేశ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి నెలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రంలో తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగి సారంగమై లిప్తలో క్షిప్తమై కాననే కాలమే మొలకలే వేసె నా సొంతమై…’’ అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ జీవితంపై తనకున్న పాజిటివ్ దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఈ సాంగ్ను యూరప్లో అందమైన లొకేషన్స్లో చిత్రీకరించారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్, తమన్ పాటను పాడారు. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.
previous post