telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పింక్” రీమేక్ లో రేణుదేశాయ్… క్లారిటీ ఇచ్చిన రేణు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ ఫాస్ట్‌గా జరిగిపోతోంది. ‘లాయర్ సాబ్’, ‘వకీల్ సాబ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అక్షరాలా 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన కీలకమైన పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల కోసం ప్రగ్యా జైశ్వాల్‌, అనసూయ భరద్వాజ్‌లను ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మేలో సినిమాను రిలీజ్ చేయబోతున్నామని దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ ఫ్లైట్ వేసారు. ఈ ఫ్లైట్‌లోనే పవన్ రోజూ సెట్స్‌కి వచ్చి వెళ్తున్నారు. అలా సింగిల్ షాట్స్‌లో చకచకా షూటింగ్స్ చేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే పింక్ రీమేక్ షూటింగ్ మొదలైన రెండు నెలల్లోనే ఓ ఆసక్తికరమైన రూమర్ బయటికి వచ్చింది. సినిమాలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా నటిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తనంతట తానే రేణూ దేశాయ్ స్పందించలేదు. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు ఓ ఫొటో పోస్ట్ చేయడంతో ఓ పవన్ అభిమాని ఇదే సరైన సమయం అనుకుని ‘వదినమ్మా మీరు పింక్ రీమేక్‌లో నటిస్తున్నారంట నిజమేనా?’ అని ప్రేమగా అడిగాడు. ఇందుకు రేణూ స్పందిస్తూ.. ‘లేదండీ ఫాల్స్ న్యూస్’ అని క్లారిటీ ఇచ్చేసారు.

Related posts